APMSIDC చైర్మన్- శ్రీ చల్లపల్లి శ్రీనివాసరావు

Download Post





1 year, 3 months

ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర కో కన్వీనర్ డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు గారు మంగళగిరి కి చెందిన చల్లపల్లి శ్రీనివాసరావు గారికి APMSIDC చైర్మన్గా రావటం పట్ల ఆంధ్రప్రదేశ్ పద్మశాలీలు తరఫున శాలువాతో సత్కరించడం జరిగింది వారు ముందు ముందు ఇంకా మంచి పదవులు అధిరోహించాలని పద్మశాలి  సామాజిక వర్గం అంతా మీ వెంటే ఉంటుందని మునగపాటి చెప్పటం జరిగింది వీరితోపాటు  ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) ప్రతినిధులు*26 జిల్లాల నుంచి వచ్చి వారికి శాలువాలతో సత్కరించడం జరిగింది
యువసేన సేవా కార్యక్రమాలకు ప్రశంస, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడి

పద్మశాలి ప్రముఖులు, ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. APMSIDC ఛైర్మన్ గా పదవీభాద్యతలు స్వీకరించిన నేపథ్యంలో దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆత్మీయంగా పలకరించిన చిల్లపల్లి శ్రీనివాసరావు గారు.. యువసేన చేపడుతున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద పద్మశాలీలకు చేస్తున్న సేవను ప్రత్యేకంగా అభినందించారు. పేద పద్మశాలీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న *ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన(APPYS)*కు ఎలాంటి సహాయం కావాలన్నా తాను అందుబాటులో ఉంటానని తెలిపారు. చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) ప్రతినిధులు గోపిశెట్టి రామాంజనేయులు ఋషి, మునగపాటి రమేష్, పెనుగొండ శ్రీనివాసరావు, గోలి వంశీకృష్ణ, మునగాల గిరిధర్, శీరపు దుర్గాప్రసాద్, కప్పాల లక్ష్మణ్, తెడ్లపు అప్పారావు, బొడ్డు శ్రీనివాస్, సింగానమల నారాయణ, చదుళ్ల రంగనాథ్ తదితీరులున్నారు.

About The Author

కొత్తగా మన గ్రూపులో యాడ్ అయిన మిత్రులకు స్వాగతం సుమాంజలు తెలియజేసుకుంటూ ..
గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశాలు మిత్రులకు తెలియజేస్తున్నాము ...

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన గ్రూపుకు అనుబంధంగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి యువసేన గ్రూపు ఏర్పడి ఉంది. ఈ గ్రూపు యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అనగా పద్మశాలి సోదరులు యువత అంతా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండడానికి, మన పద్మశాలి సోదరులకు ఏ కష్టం వచ్చినా మన వంతు సహాయ సహకారాలు అందించడానికి ,చేయి చేయి కలిస్తేనే ఏదైనా సాధించగలం .
గడ్డిపరకలన్నీ ఈ ఏకమైతే మదపటేనుగు ను కూడా బంధించవచ్చు అనే విషయం మనందరికీ తెలుసు.
 అదేవిధంగా మన పద్మశాలి కులంలో ఉన్న సోదరులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా ఎదురైనప్పుడు మన సోదరులందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి వారి యొక్క సమస్యను పరిష్కరించుకో వడం కోసం ఏర్పాటు చేసిన గ్రూపు .

ముఖ్యంగా సోదరులు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అనగా ఈ గ్రూపులో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ,పెళ్లిరోజు, తదితర మెసేజ్లు పెట్టవద్దు .

ఏదైనా మన పద్మశాలి కులానికి ,యువతకు ఉపయోగపడే మెసేజ్లు మాత్రమే పోస్ట్ చేయగలరు. అలా కానియడల మీరు ఏదైనా మనకు సంబంధం లేని మెసేజ్లు పెట్టిన యెడల డిలీట్ చేసే అధికారం అడ్మిన్ లకు ఉన్నది .
మా పోస్ట్ డిలీట్ చేశారు అని అన్యధా భావించవద్దు.

 ఏదైనా మనమంతా ఐకమత్యంతో ముందుకు సాగడం కోసం ఏర్పాటు చేసిన గ్రూపు.
 ఈ గ్రూపులో రాజకీయ ప్రస్తావనలకు తావు ఇవ్వరాదు ఎందుకనగా సోదరులు ఎవరికి నచ్చిన పార్టీలో వారు కొనసాగుతూ ఉంటారు పార్టీలపరంగా విడిపోవద్దు .
పద్మశాలి కులం పరంగా మనందరం ఒక్కటే అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలని ఈ గ్రూపు యొక్క ముఖ్య ఉద్దేశం .

కాబట్టి రాజకీయ ప్రస్తావనలు మన గ్రూపులో తీసుకురావద్దు అని సోదరులకు తెలియజేసుకుంటూ ....

జై మార్కండేయ  
జై పద్మశాలి

View Profile

CLASSIFIEDS