Download Post
1 day, 16 hours
క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలి...పోనగంటి భాస్కర్
మోదీ పుట్టినరోజు సందర్బంగా సేవా సంకల్ప ఉత్సవాలను జయప్రదం చేయండి
*భారతీయ జనతా పార్టీ తిరుపతి వెస్ట్ మండల సమావేశం మండల అధ్యక్షులు శ్రీధర్ శెట్టి గారి అధ్యక్షత నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశం లో బీజేపీ సీనియర్ నాయకులు పోనగంటి భాస్కర్ గారు పాల్గున్ని సమావేశంలో పలు అంశాలుపైన చర్చించి నిర్ణయాలు తీసుకోవడమైనది.
ఈ సందర్బంగా పోనగంటి భాస్కర్ గారు మాట్లాడుతూ మండలంలో పార్టీని సంస్థాగతంగా క్షేత్ర స్థాయి నుంచి అభివృధి చెందాలని తెలిపారు. మన ప్రియతమా ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు 30రోజులు పాటు జాతీయ పార్టీ సూచనలు మేరకు "సేవా సంకల్ప ఉత్సవాలు" ను మండలం నందు ఘనంగా నిర్వహించాలని మరియు కేంద్ర సంక్షేమ పథకాలు అట్టడుగు ప్రజానీకానికి చేరే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని , రాబోవు తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో యన్ డి ఏ కూటమి తరపున బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి అని
పోనగంటి భాస్కర్ గారు కోరారు.
ఈ కార్యక్రమం లో బిజెపి మండల ఇన్ చార్జ్ మల్ల కుప్పం శేఖర్, కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వర ప్రసాద్, దాసరి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కోండేటి ప్రేమ్ కుమార్,సుబ్బు యాదవ్, జనార్ధన్ రెడ్డి, తదితరులు పాల్గున్నారు... 💐🚩🙏