కర్నూలు -17 వ పద్మశాలియుల కార్తీక వనభోజన మహోత్సవం- 09-11-2025- ఆదివారం )

Download Post





4 weeks, 1 day

కర్నూలు పద్మశాలీ సంఘం- కార్తీక వనభోజన మహోత్సవం- (09-11-2025- ఆదివారం)-

కర్నూలు నగరం సుంకేసుల రోడ్డులోని మాసా మసీదు పక్కనున్న  ఎస్​ఎల్ ఎన్​ ఫంక్షన్​ హాల్​లో  ఈ నెల 9న ఆదివారం 17fవ పద్మశాలియుల కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు పద్మశాలియుల నగర అధ్యక్షుడు కస్తూరి వేమయ్య ,  ప్రధాన కార్యదర్శి మేడం సుంకన్న , కోశాధికారి గుర్రం శివ ప్రసాద్​, తెలిపారు.  శుక్రవారం  వారు మాట్లాడుతూ ఉదయం 8 గంటలకు ఉసిరి చెట్టుకు  పూజ జరుగుతుందని, మహిళలందరు పూజా సామగ్రి తెచ్చుకోవాలని సూచించారు. పూజ అనంతరం అల్పాహారం ఉంటుందని పేర్కొన్నారు. ఆ తరువాత ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కుల పెద్దలకు , త్రి ఐటి, జేఈఈ, నీట్​లో ర్యాంకులు సాధించిన పద్మశాలీయుల బిడ్డలకు ఘనంగా సన్మానిస్తామన్నారు.  పద్మశాలీయులు అన్ని రంగాల్లో రాణించాలని, అందుకు సంఘం తరుపున ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.    మధ్యాహ్నం 1 గంటకు భోజనం  తరువాత  క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. నగరంలోని కుల బాంధవులు అందరూ పాల్గొని కార్తీక వన భోజన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని  ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు కస్తూరి వేమయ్య కోరారు.  సమావేశంలో పద్మశాలియుల సంఘం నగర సభ్యులు క్యావర్శి గోవిందు,  కస్తూరి ప్రసాద్​, జేరుబండి హరి ప్రసాద్​, శిరసాల లక్ష్మి నారాయణ,  కాల్వ సంజీవ్​ కుమార్​,  గోరంట్ల లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

CLASSIFIEDS