ప్రగడ కోటయ్య గారి వర్ధంతి సందర్భంగా నివాళులు-మునగాల గిరిధర్

Download Post





5 months

జీవితాంతం పేద ప్రజల అభ్యున్నతికి అవిశ్రాంత పోరాటం చేసిన మానవతావాది శ్రీ ప్రగడ కోటయ్య గారు. ముఖ్యంగా చేనేత రంగ అభివృద్ధికి స్ఫూర్తివంతంగా పనిచేసిన పెద్దలు శ్రీ ప్రగడ కోటయ్య గారి వర్ధంతి నేడు. రైతు బాంధవ్యుడు ప్రొఫెసర్ ఎన్జీ రంగా గారి శిష్యులు వీరు. మద్రాసులో టెక్ష్ టైల్ కళాశాలలో శిక్షణ పొంది చేనేత సహకార రంగంలో ఉద్యోగంలో చేరి సహకార రంగ అభివృద్ధికి కృషి చేశారు. చేనేత వాణి అనే వారపత్రిక ద్వారా చేనేతల సమస్యలను రాష్ట్రమంతటా వినిపించారు. 1952 నుండి 1990 వరకు శాసనసభలో, శాసనమండలిలో, రాజ్యసభలో సభ్యులుగా పనిచేశారు.నాటి ప్రజా సమూహం వీరిని ప్రజా బంధువు అను బిరుదుతో డాక్టర్ బెజవాడ గోపాల రెడ్డి గారి చేతుల మీదుగా సన్మానించారు. దేశంలో చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం ఎన్నో సూచనలు,సలహాలు ఇవ్వడంతో పాటు అనేక రాష్ట్రాలలో చేనేత సమస్యల మీద పోరాటం చేశారు. చేనేత కార్మికులందరికీ సరిపోయేటంత నూలు సరఫరా చేయాలని నూలు ధరలు అదుపులో ఉంచడానికి నూలు మిల్లులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు అవ్వడానికి కారణం వీరే. చేనేత పితామహులుగా, ప్రజాబంధు శ్రీ ప్రగడ కోటయ్య గారి ఆశయాలు ఆదర్శాలు నెరవేరేలాలా ప్రభుత్వం పని చేయడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి.🙏
 మానవతావాది ,
 ప్రజా బంధువు ,
 చేనేత పితామహుడు
క్రీస్తు శేషులు
 ప్రగడ కోటయ్య గారి
వర్ధంతి సందర్భంగా  నివాళులు తెలియ చేస్తున్నాము... 🙏🙏🙏🌹🌹🌹💐💐💐🙏🙏🙏

        మీ
* మునగాల గిరిధర్*
* జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర యువజన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ *